Wednesday 12 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 87 (నన్నయ భారతము: ఆదిపర్వం : ప్రథమాశ్వాసం)

బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన
య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్.

కుండలాలను అపహరించిన తక్షకుణ్ణి వెంబడిస్తూ నాగలోకానికి వెళ్ళిన ఉదంకుడు, అక్కడ, సర్పశ్రేష్ఠులైన ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకులను వరుసగా నాలుగు పద్యాలలో స్తుతించడము కనబడుతుందిఅయితే, స్తుతించడములో, ఒక్కొకరిని స్తుతించే తీరు ఒక్కొక్క రకంగా ఉంటుందిపైకి స్తుతిలాగా ఉన్నా, లోపల ఎత్తిపొడుపు ఉంటుందిఅదికూడా, ఆదిశేషుడితో మొదలుపెట్టి తక్షకుడి వరకు వెళ్ళేసరికి తారాస్థాయికి చేరుకుంటుంది.

" అనేకమైన అడవులతోను, చెట్లతోను, కులపర్వతాలతోను, చక్కగా నిండి కళ కళ లాడే సరస్సులతోను, నదులతోను, కూడియున్నటువంటి యీ గొప్ప భూభారాన్ని, తన వేయిపడగలతో వహిస్తూ, నిర్నిరీక్ష్యమైన రూపం గల విష్ణుమూర్తికి యెప్పుడూ పానుపుగా ఉండి, పాపాలను పోగొట్టే, అనంతుడని పిలువబడే నాగరాజు మాకు ప్రసన్న మాకు గాక.", అని యీ పద్యభావము.

మహేద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం అనే ఏడు పర్వతాలూ కులపర్వతాలని పిలువబడతాయి.

పద్యములో చమత్కారమేమంటే, ఇందులో ఎత్తిపొడుపు ఉందిమీ ఇంటిలోనివాడు నా వస్తువు నొకటి దొంగతనం చేసాడు. దొంగతనం చేసిన పిల్లవాడు, నల్గురు అన్నదమ్ముల్లో చివరివాడు, తుంటరి వెధవపెద్దవాడు కాస్త ఊరిలో మర్యాద కలవాడుఆయన ధర్మ బుద్ధి కలవాడు, న్యాయాన్యాయములు విచారించగలవాడుఅయితే, ఆయనకు, ఇదిగో మీ చిన్నతమ్ముడు ఉత్త దొంగవెధవ అని సూటిగా చెప్పలేమునర్మగర్భంగా, ఆయన పెద్దరికాన్ని గుర్తిస్తున్నట్లుగా చెప్పాలి పద్యంలో నన్నయగారు చేసింది అదేజలధిశాయికి పాయక శయ్యయైన మీరు, మీ ఇంట్లో వాడు మీ పరువుప్రతిష్ఠలను, నీట్పాలు చేస్తుంటే ( పాడుచేస్తుంటే),  చూస్తూ ఊరుకోవడము న్యాయమా? అని చెప్పీ చెప్పనట్లు చెప్పాడు ఉదంకుడువ్యవహారశైలి తెలిసిన గడుసరి చేసే పని యిది.

ఇక, కవిత్వ పరిశీలనకు వస్తే, నన్నయగారి కవిత్వంలోని మూడు ప్రధాన లక్షణాలలో ఒకటైన అక్షరరమ్యత యీ పద్యంలో కొట్టొచ్చినట్లు కనపడుతుందిఇంకొక విశేషమేమంటే, నాలుగు పద్యాల చివర నున్న " మాకు ప్రస్నను డయ్యెడున్" అనే పదబంధము, ఒకే మకుటంతో, వందలేక వందకు పైచిలుకు పద్యాలతో వ్రాయబడే శతక రచనకు నాంది పలికిందని చెప్పవచ్చును.


పద్యం నన్నయ భారతము, ఆదిపర్వము, ప్రథమాశ్వాసంలో ఉన్నది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like