Wednesday 1 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము -10 (ఆంధ్రమహాభాగవతము. : అష్టమస్కంధము)

 "పోతన్న తెలుగుల "పుణ్యపేటి అన్నారు విశ్వనాథ. నిజమే.   ఆంధ్ర మహాభాగవతములో స్కంధంలో పద్యాన్ని వదలివేయగలముప్రతి పద్యం భక్తి రసాన్ని  చిప్పిలుతూ ఉంటుందిఅటువంటివే మత్స్యావతార ఘట్టంలోని యీ పద్యాలు.
 .
తమలో బుట్టు నవిద్య గప్పికొనుడుం దన్మూల సంసార వి
భ్రములై కొందఱు దేలుచుం గలుగుచున్ బల్వెంటలన్ దైవ యో
గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై 
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వరా!

ఇది ప్రళయపయోధి మధ్య నావలో సప్తర్షులతో పాటు  ప్రయాణిస్తూ, సర్వ నియామకుడైన భగవంతుని కరుణా విశేషాన్ని వర్ణిస్తూ సత్యవ్రతుడు చేసిన స్తుతి.

" ఈశ్వరా! కొందరు తమలో పుట్టిన అజ్ఞానం వల్ల పరమార్థం కనుగొనలేక కలత చెందుతారుఅజ్ఞానానికి మూలము సంసారము.   అటువంటి కొందరు అదృష్టం వల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి తరిస్తారుఆనంద రూపమైన మోక్షాన్ని పొందుతారు. రకముగా అందరిని ఆదరించే నీవు మమ్ము కూడా కాపాడు. "

సంసారము అంటే జారిపోయేదిసంసార జీవులకు అజ్ఞానం వల్ల నిశ్చలతత్వం రాదు. నిశ్చలతత్వం వల్ల  జీవన్ముక్తి కలుగుతుందని శంకర భగవత్పాదులన్నారు.

కన్నులు గల్గువాడు మఱి కాననివానికి ద్రోవజూపగా
జన్న తెఱంగు  మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే
కన్నులుగాగ భూతముల గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతి జాడ జూపవే.

"చూపులేనివానికి కంటిచూపు ఉన్నవాడు త్రోవ చూపుతాడుఅదేవిధంగా, అజ్ఞానికి మంచి బుద్ధి కలిగినవాడు, గురువు రూపంలో సన్మార్గాన్ని బోధిస్తాడుసూర్యుడే కన్నులుగా కలిగిన నీవు గురుడవై మమ్మల్ని ఉద్ధరించు."


" వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై" అంటారు విశ్వనాథ. అట్టి వెలుగును ప్రసాదించే సూర్యుడు జగదక్షిసూర్యమండలాంతర్గతంగా ఉండే వెలుగే, జగదక్షియైన   శ్రీమహావిష్ణువు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like