Sunday 26 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 37. (శ్రీమద్రామాయణ కల్పవృక్షము : అవతారిక)

పంచభూతములు దివాకరుండును నిశాకరుడు నీ తను సప్తకంబయేని
యీ శరీరంబు నీదే! కన్నువిప్పుట కన్నుమూయుట నీవు కలుగ వెట్లు?
ఏతదధిష్ఠాత యెవ్వడో యజమానుడనిన నీ యష్టమతనువు వాడు
కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి! బిట్టు నే నన్న దభిజ్ఞ గాక!

స్వామి! నీదు పారమ్యంబు బడయజాల
దఖిలవిశ్వంబు దాను నీ వయ్యు గూడ
హరిహర బ్రహ్మమయ మయి యర్థచంద్ర
చూడము వెలుంగును నొసంట జూడ లేక.

మానవ శరీరం పంచభూతాత్మికమైనదిఅంటే, కణముల సముదాయమైన పదార్థము, నీరు, వేడిమి, గాలి, చోటు అనేటటువంటి వాని సమాహారముబాహ్యప్రపంచము పృథువ్యాపస్తేజోవాయురాకాశాత్ అనే పైన చెప్పబడిన తత్వముల సమాహారమే.   బయట కనిపించే జగత్తుకు సూర్యచంద్రులు వెలుగును ప్రసాదించే రెండు కళ్ళయితే, బాహ్యప్రపంచాన్ని చూడటానికి సూర్యచంద్రుల వంటి  ఉపకరణాలు మానవనేత్రాలు ఏడింటిని పరమేశ్వరుని తనుసప్తకమని అంటారుఅప్పుడు మానవదేహము పరమేశ్వరునికి చెందినదే అవుతుందిఅయితే, మనిషి పునరపి జననం, పునరపి మరణం అని జనన మరణ చక్రంలో తిరుగుతూ, కొట్టుమిట్టాడుతున్నాడుకానీ, పరమేశ్వరుడు నిత్యుడు, కాలాతీతుడు, అవ్యయుడుఅదట్లాఉంచితేమానవ శరీరాన్ని చైతన్యవంతము  చేసే అధిష్ఠాత, ఆశ్రయస్థానముయెవ్వరో యజమానుడనినట్లయితే, యజమాని పరమేశ్వరుని యెనిమిదవ శరీరమేఅందుకనే, పరమేశ్వరుణ్ణి అష్టమూర్తి అంటారు.   మానవశరీరం, పరమేశ్వర ప్రసాదితము, పరమేశ్వరాంకితముఅయినప్పుడు, శరీరము నశించేటంతవరకు, శరీరధారికి తానున్నానన్న ఒక్క గుర్తు  తప్పితే, తనకంటూ, తనదంటూ యేమున్నదిత్రిమూర్త్యాత్మకమై, యీ సమస్త విశ్వమును నిండియున్న చైతన్యము పరమేశ్వరుడే, పరమేశ్వరునిదే అయినా కూడా, సచ్చిదానంద స్వరూపాన్ని చేరటానికి, స్వస్వరూపజ్ఞానాన్ని పొందటానికి సరియైన స్థానమైన చంద్రశేఖరుని వెలుగును యోగమార్గంలో, కనుబొమల మధ్య, ఆజ్ఞాచక్రములో  చూడలేకపోతున్నామని, జీవుని వేదనను తెలియబరుస్తున్నారు విశ్వనాథవారు.

బ్రహ్మాత్మ్యైకసంధానాన్ని సూచించే యీ పద్యము, కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోనిది.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like