Wednesday 8 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 18 (మనుచరిత్రము/పాండురంగ మాహాత్మ్యము)

గృహస్థాశ్రమం గొప్పదనాన్ని తెలియజేసే రెండు సీసపద్యాలు ప్రాచీనాంధ్ర సాహిత్యంలో మనకు కనిపిస్తాయిఒకటి, మనుచరిత్రములో సిద్ధుని నోట ప్రవరుని కథలో పెద్దన  పలికిస్తే, రెండవది కపటవేషధారియైన ఇంద్రుని నోట పలికించాడు   అయుత నియుతుల కథలో తెనాలి కవి రెండు పద్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

కెలకుల నున్న తంగెటిజున్ను గృహమేధి
          యజమాను డంకస్థితార్థపేటి
పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు 
          దొడ్డిబెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడ లేని అమృతంపు నడబావి సంసారి
          సవిధ మేరునగంబు భవనభర్త
మరుదేశపథమధ్యమప్రప  కులపతి
          యాకటి కొదవు సస్యము కుటుంబి
బధిరపంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటిపరివ్రాజకాతిథిక్షపణ కావ
ధూతకాపాలి కాద్యనాథులకు గాన
భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియె

పద్యంలో గృహస్థునకు పర్యాయపదాలుగా యజమానుడు, వాస్తవ్యుడు, కాపు, సంసారి, భవనభర్త, కులపతి, కుటుంబి అనేవి వాడారు పెద్దనగారుగృహస్థు లేకపోతే సంఘ వ్యవస్థ అస్తవ్యస్తమయిపోతుందిదానికి పెద్ద పట్టికనే ఇచ్చారు పెద్దనగారు తేటగీతిలోచెవిటివాళ్ళకు, కుంటివాళ్ళకు, గుడ్డివాళ్ళకు, బిచ్చగాళ్ళకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు, అతిథి అభ్యాగతులకు, బౌద్ధభిక్షుకులకు, అవధూతలకు, కాపాలికులు మొదలగు పెక్కుమందికి గృహస్థుడే ఆధారముగృహస్థు అంటే, పెరట్లో ఉన్న తేనెతుట్టెలాంటివాడనీ, తొడమీద పెట్టుకొన్న ధనపు పెట్టె అనీ, దొడ్లోనున్న కల్పవృక్షమనీ, కామధేనువనీ, ఎప్పుడూ నీటితో నిండి ఉండే దిగుడుబావి అనీ, సమీపంలో ఉన్న మేరుపర్వతం లంటివాడనీ, ఎక్కడా నీరు దొరకని మార్గమధ్యంలో చలివేంద్రమనీ, ఆకలిని తీర్చే పైరు వంటిదనీ,..........ఎన్నో పోలికలు చెప్పాడు సీసపద్యం నాలుగు పాదాల్లోఅందువల్ల,   గృహస్థాశ్రమానికి ఇతర ఆశ్రమము సాటిరాదని తెలియచెప్పాడు.

ఇక తెనాలి రామకృష్ణకవి పద్యం చూడండి.

కీలారముననుండి పాలింటికేతేర 
          బహుధాన్యములు చేల బండి యొరగ
నెడనెడ బెండిండ్లు వడుగులు వొడమ గృ
          తార్థులై యర్థించు యర్థు లలర
బరిచారికా కోటి పనిపాటు పాటింప 
          జుట్టంపు సందడి నెట్టుకొనగ
గ్రామమెంతయు నిజప్రాభవంబున మన
           సత్యనిష్టకు దన్ను సాక్షి గోర
నిత్యనైమిత్తికములు నిర్ణిద్రబుద్ధి
నాచరించుచు హరిభుక్త మాత్మభార్య
భక్తి నిడ భుక్తు గొనుచున్ కి ముక్తి గాని
నిదుర వంటిది రాతి వంటిదియు గాదు.

పూర్వం గ్రామీణ ప్రాంతం కళకళలాడుతూ ఉండేదిపశువులపాక నుండి పాలు పిండి ఇంటికి తేవడం, పొలాలలో పంటలు పండించడం, బండ్లకెత్తించడం, ఇళ్ళలో పెళ్ళిళ్ళు, వడుగులు అవ్వడం, అడిగినవారికి లేదనకుండ ఇవ్వడం, వచ్చే పనివాళ్ళు పోయే పనివాళ్ళువచ్చే పోయే చుట్టాలు, అందరివాడు అని ఊరంతా మన గురించి గొప్పగా చెప్పుకోవడం, ఫలానావాడు నిజాయతీకి మారు పేరని చెప్పుకోవడం, నిత్యకర్మలు, పండుగలు, పబ్బాలు, వ్రతాలు, శ్రాద్ధ కర్మలు మొదలైన నైమిత్తిక కర్మల నాచరించడం, దేవతార్చన అయినా తరువాత, దేవుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని, భార్య భక్తితో వడ్డించగా తృప్తిగా భుజించడం...........ఇవన్నీ ముక్తిమార్గాలు గానీ........సోమరిపోతులాగా నిద్రపోవడం లేకపోతే ఏమీ పట్టనట్లు బెల్లం కొట్టిన రాయి లాగా కూర్చోవడం, సరిగాదు.

పద్యాలు చదువుతుంటే మళ్ళీ ఒకసారి పుట్టి పెరుగిన పల్లెటూరు వైపుకి దృష్టి మరలి, చిన్ననాటి మరపురాని, మరచిపోలేని రోజులు గుర్తుకొస్తున్నాయి.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like