Monday 6 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 13 (కుమారసంభవము)

హరునకు రెండు రెండొకొ గజాజినమున్ దహనాంబకంబు నా
నురువృషభేంద్రు నెక్కుటయు నొందె గటిన్ విపులాభ్రపంక్తి భా
స్కరుడు లలాటపట్టమున గంగయు జంద్రుడు రెండు రెండొ నా
శిరమున బొంది   రబ్దపథసింధు సుధాకరు లద్భుతంబుగాన్

శివుడు పార్వతిని పరిణయమాడడానికి   ఓషధీప్రస్థపురానికి (హిమవంతుని నగరము) పయనమయ్యాడుఆయన తన వాహనమైన వృషభరాజాన్ని అధిరోహించాడుఅప్పుడు ఆయనకు కరిచర్మమును, అగ్నినేత్రమును రెండేసి ఉన్నవాయన్నట్లు, కటిప్రదేశమున   మేఘపంక్తి, ఫాలభాగంలో సూర్యుడు విరాజిల్లారు;       అదేవిధంగాగంగ, చంద్రుడు, ఇద్దరిద్దరున్నారా అన్నట్లు శిరస్సున ఆకాశగంగ, సుధాకరుడు విలసిల్లారు.

ఇది అద్బుతమైన రచన. ఇక అంతకంటే ఉన్నతమైనదేదీ లేదని చెప్పాలంటే, పోలిక అంతటి ఉన్నతమైనదయి ఉండాలిశివుని వాహనమైన వృషభరాజాన్ని అంతకుముందు ఒక సీసపద్యంలో ఉన్నతంగా, అత్యద్భుతంగా వర్ణించాడు నన్నెచోడ మహాకవి వృషభరాజాన్నెక్కి వస్తున్న శివుడెంత ఉన్నతంగా వర్ణించబడాలిఅందుకే ఉత్ప్రేక్ష.

నందీశ్వరునిపైనెక్కిన శివుడు మేఘమండలాన్ని దాటగా, మేఘపటలము, శివుడు  కటిప్రదేశంలో ధరించిన కరిచర్మము ఒకే రకంగా ఉండి, రెండా అన్నట్లున్నాయిమేఘమండలానికి చాలా ఎత్తులో ప్రకాశించే సూర్యుడు, శివుని ఫాలభాగములోనున్న అగ్నినేత్రము రెండేసి ఉన్నాయా అనిపించిందిఅదే రీతిలో, శివుని శిరస్సు ఆకాశము వరకు వ్యాపించుటచే, అతని శిరస్సున అదివరకే యుండిన గంగ కాక మరియొక ఆకాశగంగ, శివుని శిరోభూషణమైన చంద్రుడితో పాటు ఇంకొక సుధాకరుడు, ఉన్నట్లు తోచిందిమొత్తంగా కలిపి చూస్తే, శివుని వాహనమైన వృషభరాజము అంత ఎత్తుగానూ, దానినెక్కి వస్తున్న శివుడంత ఉన్నతుడుగానూ ఉన్నారని భావము.


నన్నెచోడ మహాకవి పదునొకండవ లేదా పన్నెండవ శతాబ్దానికి చెందినవాడుపదునైదవ  శతాబ్దానికి చెందిన బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతములోని వామనావతార ఘట్టంలోవామనమూర్తి క్రమక్రమంగా ఎట్లా పెరిగిందీ " రవిబింబం బుపమింప పాత్రమగు చ్ఛత్రంబై " అనే పద్యంలో అత్యద్భుతంగా వర్ణించాడుపోతన గారి వర్ణనకు నన్నెచోడ మహాకవి స్ఫూర్తి అనడం కంటే, ఇద్దరు ప్రతిభామూర్తులైన కవుల చేతిలో ఒకానొక ఊహ ఎంత చక్కగా రూపు దిద్దుకొంటుందనడనికి యీ పద్యాలు నిదర్శనాలుఇక రెండవ విషయంనన్నెచోడుని వర్ణనకు పాత్రుడు శివుడైతే, పోతన గారి వర్ణనకు పాత్రుడు శ్రీమహావిష్ణువుచైతన్య  మొక్కటే, రెండు రూపాలు మన భావనలోఇదే శివకేశవ అభేద తత్వం.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like