Tuesday 31 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 9 (ఆముక్తమాల్యద)











సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రబంధము వర్ణనలకు పెట్టింది పేరుకృష్ణదేవరాయలవారి ప్రకృతి పరిశీలన చాలా నిశితమైనదిఆధునిక సమాజములో, పల్లెటూళ్ళలో వ్యవసాయము చేసుకుంటున్న  రైతులకు కూడా తెలియని పలు విషయాలు రాయలవారి వర్ణనలలో మనకు కనుపించి, ఆనాటి సాంఘిక వ్యవస్థను, రైతు  జీవనాన్ని మనోగోచరం  చేస్తాయిఉదాహరణకు, వివిధ రకములైన వరిధాన్య విశేషాలు ఒక పద్యంలో కనిపిస్తాయి. ఒక్క రాజనాలు తప్ప,   తీగమల్లెలు, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడి గుత్తులు, కుసుమాలు, సంపెంగలు, పచ్చలు , గన్నేరులు, పాళలు,   మొదలగునవి పుష్పజాతులని మనకు తెలుసుఇవి ఆనాడు రైతులు పండించిన వరిధాన్య రకాలని మనకు తెలియదుఇక, చాలామందికి తెలియని ఇంకొక విశేషం కూడా రాయలువారు పద్యంలో యెంతో రమణీయంగా చెప్పారు చూడండి.

అడుగున బండి వ్రీలి అసలై మధువుట్టగ ద్రాగుదేంట్లు
ల్లడి గొని చుట్టురా బనసల్చొలుచుంగలు గుండ్లతోడ నీ
డ్వడు పెనుబండ్లు, భిన్న కట పాంసుల భూరిమదాంబు సేచనా
జడ దృఢ శృంఖలాయుత వసంత నృప ద్విరదాధిపా కృతిన్.

శ్రీవిల్లిపుత్తూరులోని తోటలలో పనస.   చెట్లున్నాయి .   .  అవి వేరు పనస చెట్లుమనమందరం కొమ్మలకు కాసే పనస కాయలను చూశాము. ఇవి చెట్టు వేరుకు కాసే పనసపండ్లుపనస , పండుగా అయిన తరువాత, భూమి పగిలి, పండు రసం  కారితే, దానికి, చీమలు, తుమ్మెదలు మూగుతాయిఇక పనసపండ్లు యెంత పెద్దగా ఉన్నాయంటే, అవి పెద్ద బండరాళ్ళ లాగా ఉన్నాయి మొత్తం చూడడానికి ఎట్లాఉన్నదంటే, వసంతుడనే చక్రవర్తి యొక్క పట్టపుటేనుగు దవడలనుండి మదజలం స్రవిస్తూ ఉంటే, ఏనుగును కట్టివేసే గొలుసులాగా ఉంది తుమ్మెదల బారుఎంత చక్కని పోలికఎంత నిశితమైన దృష్టిపెద్ద పెద్ద బండరాళ్ళలాగా ఉన్న  పనసపండ్లు మదగజాల్లాగా ఉన్నాయటపండిన పెద్ద పనసపండు బూడిద రంగులో ఏనుగు లాగానే ఉంటుంది. పండు రసం  దాని చెక్కిళ్ళనుండి స్రవించే మదజలం లాగా ఉన్నదట..  పండ్లరసం చుట్టూ  మూగిన తుమ్మెదలబారు, ఏనుగును కట్టివేసిన గొలుసు లాగా ఉన్నదటఏనుగు దవడల నుండి కారే మదజలం చుట్టూ తుమ్మెదలు మూగడం మనకు తెలిసిన విషయమేఎంత సహజమైన వర్ణన.

శ్రీకృష్ణదేవరాయలవారి చలువ వల్ల, పనసపండు పండినట్లే తెలుగువారి పంట పండిందిమనం వారి కావ్యరసాన్ని జుఱ్ఱుకోగలుగుతున్నాము.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like