Tuesday 14 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 25. (పాండురంగ మాహాత్మ్యము)

మునిజన భాగదేయమగు మోక్షము పక్షము లేక  పల్కి నీ
వనఘవిచార! సారె గొనియాడెదు బూడిదబొట్టువోని యీ
చెనటి గృహస్థ ధర్మమది, చిమ్మెట సింగమెగాజు రత్నమే
కనక శలాటుకాధమము కల్పఫలంబె? చలంబు లేటికిన్?

సంపద చేత గాని కొనసాగవు సువ్వె  గృహస్థ ధర్మముల్,
సంపద పూర్వజన్మ వికసత్సుకృతంబున గాని చేర, దా
సంపద చేరియున్ మదవశంవదు జేయు మహాత్మునేనియున్
జంపకు నన్ను గన్నుసిమి, చంపుడు ముంపుడు బోధగాథలన్.

పై రెండు పద్యాలు తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము నందలి అయుత  నియుతుల కథ లోనిది.

అయుతుడు, నియుతుడు  అనే వారు  ప్రయుతుడు అనే వాని కుమారులుఅగస్త్యునికి శుశ్రూష చేసి అతని మెప్పు పొందుతారుఅగస్త్యుడు వారిద్దరికీ తగిన కన్యలు ఎవరని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడుఅప్పుడు బ్రహ్మ అంతకు ముందు తాను సృష్టించిన గాయత్రి, సావిత్రి అనే కుమార్తెలను అగస్త్యునకు ఇస్తాడుతిరిగి వచ్చి యీ విషయం అయుత  నియుతులకు చెబితే, అయుతుడు వివాహానికి అంగీకరించడుఅగస్త్యుడు ఇద్దరనూ  నియుతున కిచ్చి వివాహం చేస్తాడుగుర్వాజ్ఞ  పాటించనందుకు, బ్రహ్మచర్యం తరువాత ధర్మమార్గంలో గృహస్థాశ్రమం స్వీకరించనందుకు, అగస్త్యుడు అయుతుణ్ణి వెళ్ళిపొమ్మంటాడుఅయుతుడు హిమాలయప్రాంత భూమికి వెళ్ళి తపస్సు చేస్తుంటాడుఉగ్రమైన తపస్సుకు భయపడి ఇంద్రుడు వృద్ధబ్రాహ్మణ వేషంలో అయుతుని వద్దకు వచ్చి గృహస్థాశ్రమం యొక్క ప్రాశస్త్యాన్ని పలు విధాలుగా వివరిస్తాడుఅయినా ఇష్టపడని అయుతుడు, గృహస్థాశ్రమం లోని ఇబ్బందులను ఏకరువు పెడతాడుఅదే పై పద్యాల లోని విషయము.

"మునులకు సంపద అయినటువంటి మోక్షము పక్షాన మాట్లాడకుండా, బూడిద బొట్టులాంటి గృహస్థాశ్రమం గురించి గొప్పగా చెబుతావేంటిఎంతచెప్పినా, చిమ్మెట సింహమవుతుందా, గాజుముక్క రత్నమవుతుందా, ఉమ్మెత్త కాయ కల్పవృక్ష ఫలమౌతుందా?

సంపద ఉంటే గానీ గృహస్థు మనుగడ సాగించలేడుఇక సంపదలంటావా, పూర్వజన్మ సుకృతం వల్ల గానీ రావుఒకవేళ వచ్చినా, అవి మహాత్మునికి   కూడా  మదాన్ని కలిగిస్తాయి. "  అందుకని నిండా ముంచే యీ కథలు, బోధలు చెప్పి, తనను చంప వద్దన్నాడు అయుతుడు.


ఇంద్రుడు గృహస్థాశ్రమం గురించి చెప్పిన విశేషాలు  (సువర్ణ సుమన సుజ్ఞేయము -18 లో చూడండి), ఇప్పుడు అయుతుడు వాటికి దీటుగా చెప్పిన సమాధానము, ఒక న్యాయస్థానములో ఇద్దరు తమ తమ వాదనలను సాక్ష్యాలతో సహా, సహేతుకంగా వాదించిన తీరు కనిపిస్తుందిఇందులోని ధర్మాధర్మాలను ప్రక్కన పెడితే, ఇద్దరు మంచి న్యాయవాదుల మధ్య జరిగిన బ్రహ్మాండమైన వాదనను తలపిస్తాయి ఇంద్రునికి అయుతునకు మధ్య జరిగిన సంభాషణలు.  

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like