Thursday 2 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 12 (పాండురంగ మాహాత్మ్యము అవతారిక)

శ్రీకాంతామణి గన్మొరంగి మది ధాత్రిన్  మంచినన్, తద్రుచి
శ్రీకాదంబిని మీదికుబ్బెననగా శ్రీవత్సమున్ దాల్చి ము
ల్లోకంబుల్ పొదలించు కృష్ణుడు దయాళుండేలు శ్రీవైష్ణవ
స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్!

ప్రాచీనాంధ్ర  పంచ మహాకాకావ్యాలలో ఒకటిగా పేరెన్నిక గన్న తెనాలి రామకృష్ణునిచే రచింపబడిన పాండురంగ మాహాత్మ్యము కావ్యము అవతారికలోని మొదటి పద్యమిదికావ్యారంభమే చాలా గొప్ప ఊహతో జరిగింది.

శ్రీకాంతామణి లక్ష్మీ దేవి. ఆవిడ కన్నుగప్పి మనస్సులో భూదేవిని తలంచాడట శ్రీమహావిష్ణువుఅప్పుడు భూమి యొక్క గొప్పదైన కాంతి ఆయన వక్షస్థలం మీదకు ఉబ్బిందటఅది ఎట్లా కనిపించిందిశ్రీకాదంబిని (గొప్ప  మేఘం) లాగా ఉబ్బి స్వామివారి వక్షస్థలం మీద శ్రీవత్సం లాగా కనిపించిందిశ్రీమహావిష్ణువు వక్షము మీద నున్న పుట్టుమచ్చకు శ్రీవత్సమని పేరుఅటువంటి శ్రీవత్సమును దాల్చిన కృష్ణుడు కృతిస్వీకర్తయైన విరూరి వేదాద్రి మంత్రిని రక్షించు గాకఇదీ పద్యం యొక్క అర్థం.

శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువునకు నిత్యానుపాయినిఎప్పుడూ ఆయనకు దగ్గరగానే ఉంటుందిఇంకొక దేవేరి భూదేవి దూరంగా ఉన్నా ఆయన అంతరంగంలో ఉంటుంది. ఆమె ప్రేమ పైకి వచ్చి శ్రీకాదంబిని (గొప్ప మేఘంలాగా ఉబ్బి శ్రీమహావిష్ణువు వక్షము మీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ లాగా కనిపించింది.

ఇది చాలా చక్కని ఊహఆకాశమార్గంలో వెళ్తూ పైనుండి క్రిందకు చూచిన వారికి, భూమి నల్లనైన మేఘాల మధ్య కనిపిస్తుంది. అందుకే భూమిని శ్రీమహావిష్ణువు వక్షము మీదకు ఉబ్బిన శ్రీవత్సమనే నల్లని పుట్టుమచ్చగా అభివర్ణించాడు కవి. మేఘము నల్లనిది, పుట్టుమచ్చ నల్లనిదిఆకాశం అంతటా వ్యాపించియున్న  మేఘపటలాన్ని, సర్వవ్యాపియైన  శ్రీమహావిష్ణువు  పుట్టుమచ్చతో   పోల్చడం అత్యద్బుతం

అయితే గడుసువాడైన తెనాలి కవి పద్యంలో భావి కథార్థాన్ని సూచించాడని  డా.డి.ఎస్. గణపతి రావు గారు తమ పాండురంగ మాహాత్మ్యము పామర వ్యాఖ్యానములో వ్రాశారువిష్ణుభక్తుడైన పుండరీకుడు తనకు ప్రత్యక్ష దైవాలైన తలిదండ్రులను బాహ్యంగా సేవిస్తూ, కృష్ణుణ్ణి తన అంతరంగంలో నిలుపుకున్నాడుతలిదండ్రులు పరలోకగతులైన తరువాతఅతని అంతరంగ భక్తి ఉబ్బి పైకి  వచ్చి తన యెదుట కృష్ణుని రూపంలో నిలిచింది. పుండరీకుడు తన పేరిట పుండరీక క్షేత్రంలో పాండురంగనిగా వెలసి భక్తులను ఉద్ధరించవలసినదని వరం కోరాడు


విధంగా రామకృష్ణుడు అవతారికలోని మొదాటి పద్యంతో " మహాంధ్ర కవితా విద్యా బల ప్రౌఢి నీ కెదురేరీ! " అని సూచనప్రాయంగా తెలియజేశాడు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like