Friday 31 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 47. (నన్నయ భారతము: ఆదిపర్వం: ప్రథమాశ్వాసం)

నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము, జగన్నుత! విప్రులయందు, నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుడోపు, నో
పండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్.

" నిండు మనంబు " వంటి పద్యమునకు " నిండు మనంబు " పద్యమే సాటియని తిక్కన గారు ప్రశంసించిరని యొక కీర్తి పై పద్యమునకున్నదని విమర్శకులు శ్రీ కాజ లక్ష్మీ నరసిం హారావు గారు తమ " ఉదంకుని కథ: నన్నయగారి ఋష్యాత్మ " అనే వ్యాసంలో పేర్కొన్నారు.

నన్నయ ఆంధ్రీకరించిన   ఆంధ్రమహాభారతము, ఆదిపర్వములో ఉదంకుని కథ ఉన్నదిఉదంకుడు ఋషిపైలుని శిష్యుడుపౌష్యుడనే రాజు భార్య వద్దనున్న కుండలాలను గ్రహించాడురాజు ఉదంకుని " నీవు మాయింట గృతభోజనుండవై పొమ్ము " అన్నాడు. వడ్డించిన  అన్నములో వెంట్రుక వచ్చిందని, కోపించి, అపరీక్షితంబయిన అశుద్ధాన్నము పెట్టావు కనుక అంధుడవు కమ్మని శపించాడు ఉదంకుడుఅల్పదోషకారణంతో తనను శపించాడు గనుక, ఉదంకుని అనపత్యుడవు కమ్మని శపించాడు పౌష్యుడుతాను సంతానహీనుడుగా ఉండలేనని శాపాన్ని ఉపసoహరించమన్నాడు ఉదంకుడుతనకు శక్తి లేదని  చెప్పిన  పౌష్యుడు, బ్రాహ్మణునికి, క్షత్రియునికి గల  తారతమ్యాన్ని, మనోవిశ్లేషణాత్మకంగా చెప్పిన అద్బుతమైన పద్యమిది.

" బ్రాహ్మణుడు శాపానుగ్రహ సమర్ధుడుక్షత్రియుడు అట్లా కాదుదీనికి కారణం వారి వారి మనస్తత్వాలుబ్రాహ్మణుని మనస్సు అప్పుడే తీసిన వెన్నలాగా మెత్తనైనది. ఇక మాటంటారాఅతి పదునైన వజ్రాయుధం లాంటిది రెండూ, రాజు విషయంలో సరిగ్గా వ్యతిరేకంమనస్సేమో చాలా కఠినంగా ఉంటుంది, మాట మాత్రం తియ్యగా ఉంటుంది తారతమ్యం వల్ల, శాపమనేది మనసు లోతుల్లోనుంచి వస్తుంది కనుక, నవ్య నవనీత సమానమైన మనస్సు కల బ్రాహ్మణుడు, శాపాన్ని వెనక్కి తీసుకొని అనుగ్రహించగలడు. పని యెంత శాంతుడైన రాజయినా చేయలేడుకారణం అతని మనస్సేఅది అతి కఠినమైనది. "

ఎంత చక్కని మనోవిశ్లేషణ!

పద్యంలో విప్ర శబ్దం రెండుసార్లు ప్రయోగించబడ్డది.  " విశేషేణ పాపేభ్యః ఆత్మానం పరం పాతీతి విప్రఃఅని వ్యుత్పత్తి. " తనను, పరుని విశేషముగా పాపము నుండి రక్షించువాడు " అని అర్థముఋషి అయిన ఉదంకుని రూపమున యిది నిరూపింపబడినది

ఇక కథాంతర్గత శాపాల విషయానికి వస్తే, ధర్మాన్ని అనుష్ఠానం చేసే వారి శాపాలు కూడా ధర్మబద్ధంగా, హేతుబద్ధంగా ఉంటాయి.

అపరీక్షితమయిన అన్నము పెట్టాడు గనుక, పౌష్యుడిని అంధుడివి కమ్మన్నాడు. పెట్టిన అన్నము శుద్ధంగా ఉందా లేదా అన్నది చూడవలసినది కన్నుకన్ను ఆపని సరిగా నిర్వర్తించలేదు కనుక కంటికి శిక్షఅల్పదోష కారణంబున యింత పెద్ద శాపమిచ్చాడు కనుక, ఉదంకుడిని అనపత్యుడవు కమ్మని శాపమిచ్చాడు పౌష్యుడుఅనపత్యుడు అంటే పిల్లలు లేకుండుటమరి యీ శాపం వెనుక ఉన్న హేతువు, ధర్మసూక్ష్మం యేమిటిపిల్లలున్నవారికి కష్టసుఖాలు, తప్పొప్పులు తెలుస్తాయిఉదంకుడు సంతానహీనుడయితే గాని, అతనికి చిన్న తప్పుకు యెంత పెద్ద శిక్ష వేశాడో తెలియదుఇదీ మన దేశపు ఋష్యాత్మ.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like