Thursday 30 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 43. (జాషువా గారి బాపూజీ)

జనవరి 30 తేదీజాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతిఒక్క భారతజాతి మాత్రమే గాక యావత్ప్రపంచము స్మరించుకొనే యుగపురుషుడు బాపూజీయాదృచ్చికంగా టీ.వీ. చూస్తుంటే, టీ.వీ.5 మూర్తిగారు దక్షిణాఫ్రికా నుంచి, నాడు (1893 లోజాత్యహంకార తెల్లవారిచే క్రిందకు  త్రోసివేయబడి, సత్యాగ్రహము అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించే స్ఫూరికి, స్మృతికి చిహ్నంగా ప్రదేశము నిలిచిందో, పీటర్ మార్టిజ్ బర్గ్  రైల్వే స్టేషన్ను, ఇంకా అనేకమైన దృశ్యాలను ప్రసారం చేసినవి చూసాను.   ఈనాడు ప్రదేశము ప్రపంచము నలుమూలలనుంచి వచ్చే శాంతికాముకులకు దర్శనీయమైన పుణ్యస్థలంగా మారిందికాశీ, ప్రయాగలకు మాత్రము తీసిపోని, అటువంటి పుణ్యస్థలాన్ని స్వయంగా దర్శించి, మనలందరకూ చూసే భాగ్యం కలిగించిన టీ.వీ.5 యాజమాన్యానికి సర్వదా కృతజ్ఞుడిని.

సందర్భంగా, మహాత్ముని గొప్పదనాన్ని తెలియచేసే నవయుగ కవిచక్రవర్తి గుఱ్ఱం జాషువా గారి ఒక పద్యము మీతో పంచుకోవాలని మనసు ఉవ్విళ్ళూరింది

ఎవడీ యర్థదిగంబరేశ్వరుడు  మా యిండ్లం బ్రవేశింప నం
చవమానంబుగ చర్చిలాడగ  బకిం హాం సౌధమున్ ద్రొక్కి హైం
దవజాతీయత లీను మేల్పిలక నాట్యంబాడ, శ్రీ జార్జిభూ
ధవు నింటన్ ఫలహారముల్ సలుపు తాతన్ గాంధి నర్చించెదన్.

ఇటువంటి చక్కని పద్యాలు మన పిల్లలకు నేర్పితే, కవి ఋణముజాతిఋణము తీర్చుకొన్నవారమవుతాము.

1931 సం. సెప్టెంబరులో, రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు లండను వెళ్ళినప్పుడు, ప్రొద్దున్నే 4.00 గంటలకల్లా లేచి, శరీరం గడ్డకట్టే చలిలోనదీజలంలో స్నానం చేస్తూ ఉంటే, ప్రాంతములో ఉన్నవారంతా నోరువెళ్ళబెట్టుకొని చూసారట. అంతటి ఆత్మవిశ్వాసము, అకుంఠిత దీక్ష మహాత్మునికి. విషయాన్ని ఆనాటి దినపత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయట.

" మనలాగే రక్తమాంసాలతో పుట్టిన ఒక వ్యక్తి అహింస, సత్యాగ్రహము, అనే ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడని, భావితరాలకు చెబితే వారు నమ్మలేనంత నిజము, యీ అహింసామూర్తి మహాత్మా గాంధీగారి జీవితము. ", అని ఐన్ స్టీన్ మహాశయుని వంటి శాస్త్రవేత్త, మానవతావాది అన్నాడంటే......." కేవల మర్త్యుడే గాంధిగారు?."


అందుకే, " ఆతడు ఒక మనిషి కాదు, ఒక యుగపురుషుడు. " అని జార్జి బెర్నార్డ్ షా కీర్తించారు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like