Friday 24 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 36. (ఆముక్తమాల్యద)

తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుష స్స్నాత ప్రయాత ద్విజా
వలి పిండీకృత శాటులన్ సవి దదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసబాఱువాని గని నవ్వున్ శ్శాలిగోప్యోఘముల్.

పల్లెటూళ్ళ అందం వర్ణించడానికి సాధ్యం కాదుపచ్చటి పైరుపొలాలు, పొలాల్లో వరిపైరు, పొలాలకు నీరు పారించడానికి కాలువలు, కాలువల అంచుల్లో తెల్లవారు ఝామున రెక్కల సందుల్లో తలలు పెట్టి పడుకున్న బాతులుఇంత చక్కని దృశ్యానికి రూపకల్పన చేయాలంటే ఇద్దరికే సాధ్యంఒకడు చిత్రకారుడు, రెండవవాడు కవి. అదే ఒక చక్రవర్తికవి, కవిచక్రవర్తి అయితే, అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకొంటుందిఅదే జరిగింది యీ పద్యములోచూడండి.

శ్రీవిల్లిపుత్తూరు చుట్టూ మాగాణి పొలాలున్నాయిపొలాలన్నీ పచ్చటి వరిపైరుతో కళకళ్ళాడుతున్నాయిపొలాలకు నీటికాలువలు తీర్చబడ్డాయిఅది తెల్లవారు ఝాము వేళనగర రక్షకులు కాలకృత్యాలను తీర్చుకొనడానికి వైపుకి వచ్చారు కాలువల అంచుల్లో బాతులు రెక్కలు ముడుచుకొని, తలలు రెక్కల్లో పెట్టుకొని పడుకున్నాయి. నగర రక్షకులకు అవి ఏవో ఎఱ్ఱంచు గలిగిన తెల్లని ధోవతుల్లాగా కనబడ్డాయి. " అరరేఅయ్యగార్లు స్నానం జేసి పిండిన ధోవతులు ఇక్కడే మరచిపోయి వెళ్ళిపోయారే! వాళ్ళకిద్దాము. " అనుకొంటూ రేవుల్లో దిగి దగ్గరకు వెళ్ళేటప్పటికి, బాతులు రెక్కలు టపటపా కొట్టుకొంటూ పరిగెత్తుకొనిపోయాయిఇది జూచి  వరిమళ్ళకు కాపలాగా ఉన్న స్త్రీలు పకపకా నవ్వారు.

పల్లెటూళ్ళలో కనిపించే  ప్రకృతి దృశ్యాలతో బాటు, ఊరి బ్రాహ్మణులు స్నానార్థమై వచ్చి, అక్కడ పిండి వదలివెళ్ళిన ధోవతులు, బాతులుగా కనిపించడము అత్యంత రమణీయంగాను, సహజ సుందరంగాను ఉన్నాయిఅంతేగాక, రాయలవారు నాటి సంఘవ్యవస్థను పద్యంలో ఇమడ్చడం ఇంకొక విశేషంపొలాలకు చక్కని నీటిపారుదల వ్యవస్థ, నగర పరిరక్షకులు, అన్నిటికీ మించి, ధర్మపాలకుడైన ప్రభువు నీడలో, నగర రక్షకుల ధర్మ బుద్ధి, యీ పద్యంలో ద్యోతమానమవుతున్నది.


ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు గట్టినట్లు వర్ణించడము ఒక్క సాహితీసమరాంగణ సార్వభౌమునకే సాధ్యమంటే అతిశయోక్తి కాదేమోఆముక్తమాల్యద ప్రథమాశ్వాసములో కనుపించే ఇటువంటి వర్ణనలు యీ మహాకావ్యంలో కోకొల్లలు..

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like