Wednesday 15 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 26. (పాండురంగ మాహాత్మ్యము)

మనమొక కావ్యం చదువుతున్నప్పుడు, కొన్ని పద్యాలు మనస్సును కట్టిపడవేస్తాయిఅది వానిలో   నున్న అర్థము గాంభీర్యం వల్ల కావచ్చును  లేక అక్షర రమ్యత వల్ల కావచ్చునుఅటువంటి పద్యమే తెనాలి రామకృష్ణుని యీ పద్యము.

కందర్పాస్త్రములంచు సంచిత తటిత్కాండంబులంచుం సుధా
మందస్యందములంచు, గాంచన లతామత్తల్లులంచున్ సుధీ
బృందంబుల్ ధ్వనినిందలం దెగడు నీ బింబోష్ఠలందెల్ల నా
నందాభాసమె గాక భాసిత చిదానందంబు పెంపొందునే

సువర్ణ సుమన సుజ్ఞేయము -25 లో, గృహస్థాశ్రమాన్ని నిరాకరించడానికి అయుతుడు తన  బలమైన వాదనలు  వినిపించాడో వివరించానుదానికి కొనసాగింపుగా, పద్యంలో, స్త్రీల సుకుమారత్వము చాటున దాగియున్న అశాశ్వతత్వాన్ని ఎత్తిచూపుతున్నాడు చూడండి.

పద్యములో స్త్రీల సౌందర్యాన్ని పొగుడుతూ మంచి విశేషణాలను వాడారు కవి.    పైకి కనిపించే యీ పొగడ్త వెనుక తెగడ్త కూడా, అందమైన గులాబి పువ్వు వెనుక గుచ్చుకొనే ముల్లు లాగా, ఉందని గ్రహించాలికందర్పాస్త్రములు - మన్మథుని కుసుమ బాణాలు (సుకుమారమైనవే గాని వాడిపోయేవి), సంచిత తటిత్కాండమ్ములు - చక్కని మెరుపుల గుంపులు  (కళ్ళు మిరిమిట్లు గొలిపే సొగసు కలిగినవే గానీ క్షణికములు), సుధామందస్యందములు - మెల్లగా పారు అమృత ప్రవాహములు ( తియ్యనైనవే గానీ చంద్రుని కాంతి వలె క్షీణించునవి), కాంచన లతామత్తల్లులు - సంపంగి తీవలు (సువాసనాభరితమైనవే గాని ఎండి పోయేటటువంటివి).  కావున, యీ బింబోష్ఠలందు (స్త్రీల యందు), ఆనందాభాసమే (ఆనందమనే భ్రమ) గానీ భాసిత చిదానందము (ప్రకాశవంతమైన, శాశ్వతమైన ఆనందము) ఎలా ఉంటుందని అయుతుడు బ్రాహ్మణవేషంలో నున్న ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు.

పద్యము యొక్క విశిష్టత దీర్ఘసమాసగతమైన అక్షర రమ్యతలోనుస్తుతి వలె నున్న ధ్వనినిందలో ఉందిచివరకు, స్త్రీల గురించి యీ పద్యములో ముచ్చటించామో, స్త్రీలకు ' సుధీబృందములు ' అని అందమైన పదబంధాన్ని వాడారుఅందువల్లనే, పాండురంగ విభుని పదగుంఫనంబు ' అని రసజ్ఞుల, విమర్శకుల ప్రశంస  పొందింది తెనాలివాని రచనాశైలి.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like