Tuesday 15 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 771 ((శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము)



సొరిదిం జెప్పెను తార పోవలదటంచున్ నీ మహాధర్మ సుం
దర శీలంబునయందుఁ బొల్చిన మహాధైర్యంబుతో వచ్చితిన్ 
బరమోదాత్తుడవిట్లు చేసితివి నీ పాపంబు నీ చేత సా
కిరియై వానరరాజ్య లోభమతియై సుగ్రీవుండు చేయింపగా

అయ్యో ! రాఘవ యేమి చేసితివయా ! యాచంద్రతారంబుగా 
నొయ్యన్ నీదెస మచ్చచెప్పుపని యేడో వాడు దుర్మార్గుడై 
ముయ్యేఱై చను నీ యుదాత్తచరితమున్ ఖండదేశంబునన్
జియ్యంబట్టు మతిన్ విసంబు కలిపించెన్ భాగలుద్ధాత్ముడై

ఇదిగో వీనికి రాజ్య మిమ్మనిన నేనిత్తున్ గదా నన్ను నే
పొదలన్ గుట్టలఁ గానలన్ వెలుగులన్ బొమ్మన్నఁ బోదుం గదా 
అదియుం జూడుమ యాతఁ డైనదియు నీకా నేను గాకున్న
ట్టిది యేమున్నది భూసుతన్ వెదకుపొంటెన్ నీకు కార్యంబుగా

అలఘుభుజాబల సా
రోజ్వలుడై విదలించి సప్తసాగరముల లో 
పల ముంచి యెత్తఁగల్గుదుఁ
బలితమహాకేళిఁ బంక్తికంధరు నేనై.

శ్రీరాముని బాణానికి నేలగూలిన వాలి రాముడిని నిలదీసి, యీ అధర్మ వార్తన మేమిటని ప్రశ్నించాడు.

" తొందరపడి యుద్ధానికి పోవద్దని నా భార్య యెంతో చెప్పింది. కానీ నీ ధర్మయుతమైన శీలసంపద మీద నమ్మకంతో, గొప్ప ధైర్యంతో వచ్చానుఅంత ఉదాత్తచరిత్ర కలవాడి వింత పాపం చేసావు. కాదు, కాదు, నిన్నడ్డం పెట్టుకొని వానరాజ్యం కాజేయాలన్న లోభంతో సుగ్రీవుడు నీ చేత యీ పాపం చేయించాడు

అయ్యో ! రాఘవా ! ఏం పని చేశావయ్యా ! ఆచంద్రతారార్కం నీకు మచ్చ తీసుకొనివచ్చే పని ఎవడో వాడు నీ చేత చేయించాడు కదాముల్లోకాల్లోను పవిత్ర గంగాజలంలాగా ప్రవహించే నీ భవ్యచరిత్రను, భూమిజనులే యీసడించుకొనేటట్లుగా, రాజ్యం కోసమని, దేవుడులాంటి నిన్నడ్డం పెట్టుకొని, నీ మనస్సులో విషాన్ని నింపి, నీ చేత యీ పాపం చేయించాడు.  

ఇదిగో, వీడికి రాజ్యమివ్వు అని ఒక్క మాటంటే నేను ఇచ్చేవాడిని కదా ! నన్ను పొదల్లోనో, గుట్టల్లోనో, అడవుల్లోనో తలదాచుకోమంటే వెళ్ళిపోయేవాడిని కదాఇంకొక సంగతి. అతడు నీకు చుట్టమూన్ను, నేను కానివాడినాచెప్పుఅయినా నీకు కావలసిన పని ఏముంది కనుకసీతాదేవిని వెదకటమే గదా

మహాబాహుబలోజ్వలుడనైన నేను దశకంఠుణ్ణి ఏడు సముద్రాల్లో ముంచెత్తి ఒక ఆట ఆడుకోగలను. " 

ఎవడో వాడు దుర్మార్గుడై రాముని చేత యీ పాపం చేయించాడని, తప్పును సుగ్రీవునిపై నెడుతున్నాడు గానీ, నిజానికి చెడు మార్గంలో పోయింది వాలిరెండవది, ' నీవు రాజ్య మిమ్మంటే ఇచ్చేవాడిని గదా ! ' అన్నాడు గానీ, తార యెంత బుజ్జగించి చెప్పింది సుగ్రీవుడిని యువరాజును చేసి అన్నదమ్ముల మధ్య వైరానికి స్వస్తి పలుకమని ! బాహుబలగర్వంతో విర్రవీగిన వాలికి అప్పుడు అవి గుర్తుకు రాలేదు

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖాండము లోనివి.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like