Saturday 5 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము- 746 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)




తోరముగా మనస్సున కధోదిశ దేహము, నూర్థ్వదిక్కునన్ 
దూరపు భూమి నాత్మయును, ద్రోవయు ధర్మసమూహ గమ్య, మా 
తీఱని దేహవాంఛలను ద్రిమ్మరి క్రిందికిలాగు, నీ మన
స్సూరక నిత్యయత్నమున నూర్థ్వపథంబున చేర్పగావలెన్.

ఎలమి మనస్సు త్రిప్పి, యెవడేనియు ధర్మపుఁ ద్రోవ బోవగాఁ
బలుకుదు రాతనిన్ జనులు వాడొక సజ్జనుఁడంచు, ద్రిప్పకే
నిలుచును ధర్మవీధి నొక నిర్గతకల్మషు మానసంబు, లో
కులు మఱి వాని నేమి యనుకొందురు దేవతలన్నఁ జాలదే.

అనవరతంబు ధర్మమునయందుఁ జలింపని మానసంబు కా
ల్గినయది సీత, పోల్కి కదలించి యరుంధతిఁ దేజు ప్రోవుఁ జె
ప్పనువలె, గాన కీపగిది వచ్చుట గొప్పయెగాదు నిన్నుఁ బొం
దిన జనకాత్మజా మనసు నీపతిభావ త్రికాలనిష్ఠమై.

లిప్త కాల భాగ లేశలేశంబున 
యందు నామె హృదయ మంటియుండు
ధర్మమార్గమందుఁ దప్ప దొక్కింతయు
నింతకంటెఁ జెప్పనేమివలయు.

అగస్త్య మహాముని సీతను గురించి ప్రశంసా వాక్యాలు పలుకుతున్నారు.

" మనస్సు అనే దానికి క్రింది దిక్కున దేహ ముంటుంది. పై దిక్కున చాలా దూరంగా ఆత్మ అనేది ఉంటుంది. రెండింటి మధ్య గల మార్గమే గమ్యస్థానాన్ని చేర్చే ధర్మముఅయితే, అంతులేని కోరికలు మనస్సును క్రిందికి లాగుతూ ఉంటాయి. అందుచేత, మనస్సును నియంత్రించి, నిత్యజగరూకుడై, దానిని పై నున్న గమ్యస్థానానికి, అనగా, ఆత్మపదార్థం వైపుకి చేర్చాలి.

ఎవరైనా మనస్సును నియంత్రించి, ఆత్మపదార్థం వైపుకి త్రిప్పి, ధర్మమార్గాన పోతే, లోకం వాడిని సజ్జను డంటుంది విధంగా మనస్సును త్రిప్ప నవసరం లేకుండా, ధర్మమార్గంలో మనస్సు స్థిరంగా ఉండే నిష్కల్మషమానసుడిని లోకం ఏమని పిలవాలిఅటువంటివారిని దేవతలంటే చాలదా !

నిరంతరం ధర్మ మార్గంలో నిలిచే మనస్సు కలిగినది సీత. పోలిక తీసుకువచ్చి ఆమెను చెప్పాలంటే, ఆమె అరుంధతి వంటిదిరామచంద్రాత్రికాలముల యందు నిరంతరం పతిభావంతో నిండియున్న జానకి  నీతోపాటు అడవులకు రావటం పెద్ద విషయం కాదు

లిప్తలుగా విభజింపబడిన కాలభాగంలో, లేశలేశాన ఆమె హృదయం  నిండి ఉంటుంది. ధర్మమార్గాన్ని ఆమె కొంచెం కూడా తప్పదుఇంతకంటె ఏం చెప్పాలి? "

విధంగా సీతను గురించి అగస్త్యుడు ప్రశంస కురిపిస్తుంటే, ఆత్మస్తుతి విముఖురాలయిన సీత, అక్కడ ఉన్న హరిణీసమూహాన్ని చూస్తూ ఉండిపోయింది.

పద్యాలు సనాతన ధర్మానికి  పరమ ప్రమాణమైన పాతివ్రత్యాన్ని ఉగ్గడిస్తూ  చెప్పినవి. మహర్షి చెప్పిన మాట యదార్థమే అయినా, " ఆత్మస్తుతి విముఖయైన జానకి హరిణీసమూహంబు గాంచుచుండె" అన్న వచనభాగం, మహితాత్మలు పొగడ్తలకు ఎంత దూరంగా ఉంటారో చెప్పకనే చెబుతున్నది.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like