Saturday 12 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 763 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: ప్రస్థాన ఖండము)


మాత్రంబున కంత కోపపడ నీవేలాగు కాంతారవీ
ధీమార్గంబుల నాదు మాటలకు నాధిం బెందెదో యన్న నో
స్వామీ ! దండధరుండు నిన్నుఁ గొనిపోవన్ రానె రావద్దు సా
మీ ! మాయామతి యేడొ నన్నె కొనిపోనీ, వాడొయింకెవ్వడో

అనిన శ్రీరామచంద్రుండు

కోపంబేచుఁ దుషారరుఙ్మృదుకలాకోటీరుచేఁ గాలుఁ డే
యాపత్తింగనెనో మృకండుసుతు ప్రాణాకర్షణప్రక్రియన్ 
నా ప్రాణంబగునట్టి నీదెస నెలంతా ! యాతడౌ నెవ్వడో
నో పద్మానన ! యంతకంటెఁ బదిరెట్లొందున్ మహాపత్తతుల్.

రామునితో పాటు వనవాసానికి వెళ్ళటం కోసమని సీత సావిత్రి ఉదంతం చెప్పి, భర్తృవ్రతాన్ని పాలించటం స్త్రీ యొక్క పరమ ధర్మమని చెప్పింది. రాముడు నవ్వి, " అయితే యమధర్మరాజు అరణ్యంలో నా ప్రాణాలను హరించాలి, అప్పుడు నీవు నన్ను రక్షించాలన్నమాట " అని పరిహాసమాడాడుదానితో సీత రాముని కళ్ళలోకి తీక్షణంగా చూసింది.  

అప్పుడు రాముడు, " అయ్యో ! ఇంత చిన్న మాటకే అంత కోప పడితే, ఇక అరణ్యంలో  నా మాటలకు ఇంకెంత మనోవ్యథ చెందుతావో కదా ! " అన్నాడుబదులుగా సీత, " స్వామీ ! మిమ్మల్ని యమధర్మరాజు తీసుకువెళ్ళటానికి రానే రావద్దు ప్రభూ ! నన్నే మాయగాడో, ఇంకెవడో తీసుకెళ్ళనీ ! " అన్నది.

అందుకు శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు.

" సీతా ! మార్కండేయుడి ప్రాణాలను హరించాలని వచ్చిన యముడు కోపంతో రగిలిపోయిన చంద్రశేఖరుని చేతిలో యెంత ఆపదకు గురయ్యాడో, నాకు ప్రాణసమానమైన నీ కోసం, వాడెవడైనా సరే పదిరెట్లుగా ఆపదలు కలుగజేస్తాను. " 

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్థాన ఖండము లోని యీ పద్యాలలో సంభాషణలు సహజ సుందరంగా ఉండి భవిష్యదర్థం గోచరింపజేస్తున్నాయి.

తెనాలి రామకృష్ణుని వలె, విశ్వనాథ సంబోధనలు చాలా రమ్యంగా ఉంటాయనేది సాహితీప్రియులకు తెలిసిన విషయమేవిశ్వనాథ " మా స్వామి " అనే శతకం లోను, శ్రీమద్రామాయణ కల్పవృక్ష ఖండాంత పద్యాల లోను శివుణ్ణి పలు రకాలుగా హృద్యంగా సంబోధించారు సన్నివేశంలో చంద్రశేఖరునికి పరంగా " తుషారరుఙ్మృదుకలాకోటీరు " డని సంబోధించారు. అర్థం ఒకటేచల్లని వెన్నెలలు కురిపించే చంద్రుణ్ణి తలపై ధరించినవాడు " అనికానీ, క్రొత్త అందాలను దిద్దుకొంది కదా !  

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like