Tuesday 15 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 770 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)

ఓయీ ! శ్రీరాఘురామ ! యీ యడవి నీ యున్కిం బ్రమాణంబులో 
భూయిష్టంబుగ జెల్లిపోయె మఱి యే మూడేండ్లో మీ కైక తా 
నే యూహన్ నినుఁబంచెనో వానికి నీ కే యూహ లోనుండెనో

యా యూహాఖిల సర్వసిద్ధియగుఁ జో టాలోచనం జేసితిన్

నీ సత్యవ్రతపాలనా నియమ పాడిత్యంబుచే రాఘవా !
యాసూర్యంబుగ మీకులంబు పరిపూతాకారముం దాల్చెనో
యీ ! సత్యవ్రతబుద్ధి నీ జనకు డూహింపంగరానట్టి వా
చాసత్యత్వము రూపమేర్పడఁ గ్రియాసంధానముం చేయుటన్

తా వరయుగ్మ మిచ్చుటయె దారణినాథుని యిష్టమట్లు కా
దో వరమీయ నేది యగునో యది యౌనని చెప్పియుండు నీ
తో వనమేగుమంచు ననడో యిది నీ సుగుణంబు చేత నీ
వే వెస జేయగావలయునిద్దఱ ధర్మము లిట్టి సూక్ష్మముల్

తండ్రికి నా తండ్రియు
నీ తనయున కీవు నీవు నిద్దఱ ధర్మ
ద్యోతితమూర్తుల యోత
ప్రోతముల క్రియోహ లేకరూపము రామా

సీతారామలక్ష్మణుల వనవాసం పదేండ్లు పూర్తయింది. అగస్త్యాశ్రమం నుండి బయలుదేరటానికి ముందు, అరణ్యంలో నివాసయోగ్యంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశమేమైనా ఉందా అని రాముడు అగస్త్య మహర్షిని అడిగాడు. అగస్త్యుడు కన్నులు మూసుకొని కొంచెం సేపు ధ్యానంలో ఉండి, ఇలా అన్నాడు.

" ఓయీ ! రఘురామా ! నీవు వనవాసం చేయవలసిన మొత్తం కాలంలో, యెక్కువభాగం అయిపోయిది. ఇక రాబోయే మూడేళ్ళలో, నీ పినతల్లి ఊహతో నిన్ను అడవులకు పంపిందో, అసలు నీ మనసులో ఊహ పెట్టుకొని అడవులకు వచ్చావో, అందరి ఊహలు ఫలసిద్ధి పొందే చోటును గురించి ఆలోచన చేశాను

రాఘవా ! సత్యవ్రతబుద్ధి కలిగిన నీ తండ్రి కూడా ఊహించనటువంటి సత్యవ్రతపాలన అనే నియమాన్ని నీవు ఆచరించటమే కాకుండా, దానికి ఒక రూపాన్ని కల్పించి, అది ఫలసిద్ధి పొందే మార్గాన్ని ఏర్పరచినందుకు, ప్రత్యక్షదైవం సూర్యభగవానుని సాక్షిగామీ రఘువంశం పరమ పవిత్రంగా ఉంటుందోయి !

కైక కోరిన రెండు వరాలను తీర్చటం దశరథ మహారాజుకి ఇష్టమయి ఉండవచ్చు. అట్లా కాకుండా ఉంటే, వర మివ్వటానికి వీలుపడుతుందో అది మాత్రమే ఇస్తానని కైకతో చెప్పేవాడుకైకకు వరాలిచ్చిన నీ తండ్రి వనవాసానికి వెళ్ళమని ఏదైతే  అన్నాడో, వనవాస ఫలితాన్ని నీ అంతట నీవే సిద్ధింపజేయాలిసత్యవ్రతబుద్ధియైన నీ తండ్రి ఇచ్చిన వరాల లోనునీవు చేస్తున్న సత్యవాక్పరిపాలన లోను దాగి ఉన్న ధర్మసూక్ష్మం ఇదే

రామా ! తండ్రికి తండ్రి, కొడుకువైన నీకు నీవు, ఇద్దరికి  ఇద్దరూ ధర్మం చేత అనుసంధానం చేయబడిన ఊహ, క్రియల యొక్క ఒకే రూపం నాయనా ! "

మహాఋషులు ద్రష్టలురావణసంహారమనే మహావ్యూహనిర్మాతలలో కైకేయి ఒకరు కాగా, దానిని  చక్కగా యెలా అమలుపరచాలో తెలిసి, దానిని క్రియారూపం దాల్చేటట్లు చేసిన రెండవవాడు అగస్త్యమహర్షి.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like