Wednesday 9 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 755 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: కుంభకర్ణ ఖండము)



విధి నీ లలాటమున యందునఁ గోతులపిండుచేతిలోఁ
జావును వ్రాసె వేల్పుగమి చాలదుఁ గారుడయక్షరాడ్భుజం
గావలి చాలదిప్డు కను మస్మదమోఘము ముష్టిఘాతమై 
నీవిట నావులించెదవు నెత్తుఱు క్రక్కుచుఁ జావు ముందరన్.

అనినన్ రావణు డేది గ్రుద్దుము త్వదీయంబైన దోశ్శక్తి చూ
తుననన్ మారుతి క్రొత్త చూచెదవు నా దోశ్శక్తి నీ బిడ్డ
క్షుని శీర్షంబది రెండుగాఁ బగిలె నా గ్రుద్దుంబడిన్నాగ రా
వణు దుఃఖస్మృతి వాయుతాడితము కోపజ్వాల మిన్నంటగా.

ఒక వైపు రాక్షసవీరు లొక్కొక్కరిగా వానరుల చేతిలో మరణిస్తుండగా, రామలక్ష్మణులు ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగపాశం నుండి విముక్తులవటం రావణుడికి ఆశ్చర్య మనిపించిందిఇక, స్వయంగా తానే రంగప్రవేశం చేయనిది లాభం లేదనుకొని, ధనుర్ధారియై రావణుడు యుద్ధరంగానికి వచ్చాడుఇరుప్రక్కలా, వీరులు భీకరంగా పోరు సలుపుతున్నారుఇంతలో రావణుడిపై సుగ్రీవుడు ఒక పెద్ద కొండను విసిరాడుదానితో, సుగ్రీవుడు ప్రహస్తుడిని చంపాడన్నది గుర్తుకొచ్చి, రావణుడికి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చిందిఅంతే, సుగ్రీవుడిపై బాణవర్షం కురిపించాడుఒక బాణం సుగ్రీవుడి రొమ్ములో గ్రుచ్చుకోగా, సుగ్రీవుడు మూర్ఛపోయాడువానరసైన్యం హాహాకారాలు చేసిందిరాక్షసుల చేతిలో వానరవీరులు మరణిస్తుండటం, సుగ్రీవుడు మూర్ఛనొందటం చూసేసరికి, హనుమంతుడు, యముడిలాగా పండ్లు బిగించి, పిడికిలి బిగించి, కన్నుల్లో నిప్పులు కురిపిస్తూ, ఎండాకాలం చివరలో మేఘం ఉరిమినట్లు గర్జిస్తూ, రావణుడితో ఇలా అన్నాడు.  

" బ్రహ్మదేవుడు చివరకు నీకు వానరుల చేతిలో చావు రాసిపెట్టినట్లున్నాడు. నీకిప్పుడు దేవతలు గానీ, గారుడాస్త్రం, కుబేరాస్త్రం, నాగాస్త్రం  వంటివి గాని సరిపోయేటట్లు లేదుఅందుకని, అమోఘమైన నా పిడిగ్రుద్దును రుచి చూడు. అప్పుడు, చచ్చే ముందర నెత్తురు కక్కుకుంటూ, ఆవులిస్తూ చస్తావు.. 

మాట వినగానే రావణుడు, " ఏదీ గ్రుద్దు, నీ చేతుల్లో యెంత బలముందో చూస్తాను. " అన్నాడుఆంజనేయుడన్నాడు గదా ! " నా భుజబలం నువ్విప్పుడు క్రొత్తగా చూసేదేముందిల్ఒక్క గ్రుద్దు గ్రుద్దగానే, నీ కొడుకు అక్షుడి తలకాయ రెండుగా పగిలిందే , అప్పుడు చూడలేదా నా భుజబలం? " అన్నాడు మాటలతో రావణుడికి దుఃఖం పొంగుకొచ్చి, గాలి తీవ్రత చేత అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డట్లుగా, కోపం మిన్నంటింది. "

హనుమ రావణుల మధ్య సహజమైన సంభాషణలతో ఛందోబద్ధం చేసిన యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like