Thursday 3 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 741 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము)




యీ చెప్పిన యెల్ల న్యాయముల వైయర్థ్యమ్ము చూపింపగా 
నే యుద్ధంబున కేగుటొండె మిగిలెన్ నీవింక నేమందు విం
తై యాశాంకుర మొక్కడున్నయది తానై రాము డన్యాయమున్ 
జేయం బోడను నమ్మకంబు మఱి యా స్నేహం బికేమై చనున్.

సమరాహూతుడ నౌచు శూరజన భాస్వద్ధర్మముం బుణ్య ము
త్తముం జేయగ నేను పోవుతఱిఁ జింతం బొందుటేలే సకీ !
భ్రమ బేల్పోకుము నొక బొట్టు నిడ నాపై నొట్టు కన్నీటి మొ
త్తములం జేర్చుట వీరపత్నికి నుదాత్తశ్రీకయోగ్యంబగున్

సుగ్రీవునితో యుద్ధానికి తొందర పడవద్దని తార వాలికి ఎంతగానో చెప్పింది. రాముడు విలుకాడనీ, తాను మల్లయుద్ధవీరుడనీ, అందువల్ల, తామిద్దరి మధ్య యుద్ధం అసంబద్ధమనీ, యుద్ధానికి తావే లేదనీ ,వాలి భార్యను ఊరడించాడువాలి ఇంకా ఇలా చెప్పసాగాడు.

పైన చెప్పినటువంటి ఒకదానికొకటి పొసగని యీ అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తే, నేను యుద్ధానికి వెళ్ళటమొక్కటే  మిగిలి ఉందనిపిస్తుందినువ్వేమంటావో చెప్పు. అయినా  నాకింకా ఒక్క ఆశ మిగిలి ఉంది. అదేమిటంటే, రాముడు అన్యాయం చెయ్యబోడనే నమ్మకంమరి రామసుగ్రీవుల స్నేహం మలుపు తీసుకుంటుందో? " 

ఇంత చెప్పినా, యుద్ధానికి వెళ్ళటానికే నిశ్చయించుకొన్న భర్తను చూసి, తార, ఉషఃకాలంలో కురిసిన మంచుకు కళతప్పిన సరస్సు వలె, శోకపరితప్తహృదయురాలయింది.

ఆమెను ఓదారుస్తూ, వాలి  ఇలా అన్నాడు.

" ప్రియసఖీ ! వీరులకు ధర్మమైనట్టిది, పుణ్యలోకప్రాప్తి కలిగించేది, ఉత్తమమైనట్టిది అయిన సమరానికి ఉద్యుక్తుడనౌతున్న యీ సమయంలో దుఃఖించటం భావ్యమాఅజ్ఞానంతో గుండె నిబ్బరాన్ని కోల్పోకు. ఇకమీదట ఒక్క కన్నీటిబొట్టు రాల్చినా, నా మీద ఒట్టు రకంగా కన్నీరు కార్చటం నీ వంటి వీరపత్నికి, ఉదాత్తభావాలు కల స్త్రీకి, అయోగ్యమైనది సుమా ! "

పద్యాలకు వ్యాఖ్య వ్రాస్తుంటే దుఃఖం కట్టలు త్రెంచుకొంటున్నది. సగటు మానవుని లాగా, వీరందరూ శాపోపహతులా? లేక ఇంద్రియాలకు కట్టుబడిన విధివంచితులా? విశ్వనాథ చేతిలో ఒక వాలి, ఒక కుంభకర్ణుడు మహోదాత్తతను సంతరించుకొని, గ్రీకు, ఆంగ్ల నాటకాల్లోని విషాదాంత నాయకులను తలపిస్తున్నారు.

మాహావీరుడైన వాలి మాటలు వింటుంటే, పాత్రను మహాశిల్పియైన విశ్వనాథ ఎంత మహోదాత్తంగా చెక్కదలిచారో అర్థమౌతుంది

గుండెను పిండివేసే యీ సన్నివేశం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనిది.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like