Thursday 3 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 743 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: కుంభకర్ణ ఖండము)




వీలుం జాలును లేని దేహము తనాబీముండకొడ్కుండెనే
యోలిన్ వాలి యటంచుఁ జెప్పెదరు, నిన్నూగించి యేడౌ సము
ద్రాలన్ ముంచుచు ముంచు చుప్పుజలముల్ త్రావించ్ నంచందురా 
వాలిన్ మించినవాడు వాని కొడుకబ్బా ! యంగదాఖ్యుండగున్.

మనమేమో రాక్షసులము
మనకున్ రాక్షసులుగాగ మసలెదరు కపుల్
దనుజుడనిన శబ్దార్థము
తనదైచను భయదశక్తి తఱిగినయట్టుల్.

రావణుడికి మనసు మనస్సులో లేదు. అసలీ రాము డెవరనేది ఆయనను వేధిస్తున్న ప్రశ్న.   అసాధ్యమనుకొన్న  నాగపాశాల నుండి రామలక్ష్మణులు విముక్తులవటం ఆయనకు మహాశ్చర్యాన్ని, దానితో పాటు భయాన్ని కలిగించిందినిద్ర పట్టక మండోదరి సౌధానికి వచ్చి పట్టపురాణితో తన గోడు వెళ్ళబోసుకొన్నాడువచ్చీ రానట్లు నిద్ర పట్టినా, కలతనిద్రలో మృతులైన రాక్షసవీరులు ఒక్కొక్కరుగా ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.

ఇప్పుడు వజ్రదంష్ట్రుడనేవాడు ఇలా చెబుతున్నాడు.

" అయ్యా ! నన్ను చూడండి. నేను, వజ్రదంష్ట్రుడినిపదునైన దంతాలు కలిగినవాడినంటూ, నన్ను రాముడిని చంపమంటూ  నీ యంతటి పంపించాడని వెళ్ళానుఇక కోతులు నన్ను పోనిచ్చారా? వాళ్ళొక్కక్కళ్ళు దున్నపోతులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవిపందులు, పులులు, సింహాల్లాంటి వాళ్ళు.

వాడొకడున్నాడేబండవెధవవీలు చాలు లేని శరీరము వాడూను. వాడి పేరదేంటివాలి అని చెబుతారు. అదే, నిన్ను ఊగించి, ఊగించి ఏడు సముద్రాల్లో ముంచి, ఉప్పు నీళ్ళు తాగించాడని చెబుతారు వాలిని మించినవాడు వాడి కొడుకురా నాయనా! వాడి పేరు అంగదుడట !

మనమేమో రాక్షసులంచిత్రంగా, కోతులు మన పాలిట రాక్షసుల్లాగా తయారయ్యారురాక్షసుడు అన్న పదంలో ఉన్న భయంగొలిపే శక్తి తగ్గిపోయినట్లుంది. "

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోని యీ పద్యాలు రావణుని అవ్యవస్థిత మనస్సును తెలియజేస్తున్నాయి.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like