Monday 23 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 2. ( కుమారసంభవము/ ఆంధ్ర మహాభాగవతము: ప్రథమస్కంధము)


మెరుగుదీగలతోడి మేఘంబు నా జన్ని
      దములతో గృష్ణాజినము ధరించి
మకరధ్వజముతోడి మరుపచ్చవిల్లు
      నా గోచితో మోదుగుగోల పట్టి
చంద్రికతోడి తుషారపుంజంబు నా
      దనుకాంతితో భూతిధామ మెసగ
వీణారవముతోడి వేదనాదంబు నా
      రాగమ్ముతోడ   శివాగమములు
చదువుచును బ్రహ్మవర్చసపదవితోడి
దివ్యతేజంబు మొగమున దేజరిల్ల
సుందరాకార మమర బాలేందుధరుడు 
తాల్చి చనుదెంచె గిరిరాజతనయ కడకు.

సీసపద్యము నన్నెచోడుని కుమార సంభవము సప్తమాశ్వాసము లోనిదికఠోరమైన తపమాచరిస్తున్న పార్వతిని పరీక్షింప దలచి, శివుడు మాయావటువు రూపముతో వచ్చాడు వటువు ఎట్లా ఉన్నాడంటే:

మెరుపుతో కూడిన మేఘము వలె జందెము, లేడిచర్మము ధరించాడుమొసలి గుర్తు గల టెక్కెముతో కూడిన మన్మథుని చెఱుకుగడ విల్లుని తలపించే లాగా, కౌపీనము ధరించి ఆషాఢదండము పట్టుకున్నాడువెన్నెలతో కూడిన మంచుసమూహమా యనునట్లు, తెల్లని శరీరముపై విభూతి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడువీణానాదముతో కూడిన వేదధ్వనియా యన్నట్లు, సంగీతముతో పాటు ఈశ్వరాగమములు పఠిస్తున్నాడు. విధముగా , బ్రహ్మవర్చస్సు, దివ్యతేజము ముఖమున ఉట్టిపడుతుండగ, పార్వతి కడకు చంద్రశేఖరుడు వచ్చాడు.

బమ్మెర పోతనగారు ఆంధ్రీకరించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము లోని పద్యము చూడండి.

మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి 
నువిద చెంగట నుండ నొప్పు వాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
ముఖమున జిరునవ్వు మొలచువాడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి 
బలువిల్లు మూపున బరగువాడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
ఘనకిరీటము దల  గలుగువాడు

పుండరీకయుగము బోలు కన్నులవాడు
వెడద యురమువాడు విపులభద్ర
మూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా
కన్నుగవకు నెదుర గానబడియె.

శ్రీమదాంధ్ర మహాభాగవత రచన చేయాలనే కుతూహలముతో నున్న పోతన ఎదుట రాజముఖ్యుడొకడు ప్రత్యక్షమయ్యాడు. మూర్తిని వర్ణిస్తున్నారు పోతన్నగారు.

మేఘము ప్రక్కన మెరుపు లాగా ఆయన ప్రక్కన ఒక స్త్రీ ఉన్నదిచంద్రునిలో నుండి స్రవించే అమృతధార లాగా, ఆయన ముఖంలో చిరునవ్వు చిందులాడుతున్నది. కానుగచెట్టుకు అల్లుకున్న తీగలాగ, ఆయన భుజముపై ఒక ధనుస్సు వ్రేలాడుతూ  ఉన్నదినీలగిరిపై ప్రకాశించే సూర్యుడిలా, ఆయన తలపై కిరీటము విరాజిల్లుతున్నది విధముగా, తెల్లతామరపూవుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలముతో, దివ్యమంగళ రూపముతో, ఒక రాజముఖ్యుడు పోతనగారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.


నన్నెచోడమహాకవి పదకొండవ శతాబ్దమునకు చెందినవాడు కాగా, సహజకవి పోతనామాత్యుడు పదిహేనవ శతాబ్దమునకు చెందినవాడుఒక మహాకవి కావ్యము లోని పద్యము ఇంకొక మహాకవికి స్ఫూర్తిదాయకమై యుండవచ్చునని ఊహించుటకు తెలుగు సాహిత్యమున పెక్కు ఉదాహరణలు మనకు కనబడుతాయిఒకరు శివభక్తి పారమ్యులు కాగా, రెండవవారు శ్రీరామ పదారాధన తత్పరులు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like