Tuesday 24 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 3. (పాండురంగ మాహాత్మ్యము)










మనకు భారత, భాగవత, రామాయణాలలో చక్కని ప్రార్థనా పద్యాలు కనబడతాయి. అవి మననం చేసుకుంటూ, దైనందిన కార్యక్రమాలు చేసుకొనే వారెందరో ఉన్నారు

కోవకు చెందినదే పద్యము. చదవండి.

జగదుద్భవస్థితి క్షయ హేతువెవ్వడా
      దేవాదిదేవుండు దిక్కు నాకు
గ్రాహనిగ్రహమీగి కరిగాచె నెవ్వడా
      త్రిభువనాధీశుండు దిక్కు నాకు
దుదిపదంబు నొసంగి ధ్రువుగాచె నెవ్వడా
      ధృఢ దయామయమూర్తి దిక్కు నాకు
ద్రోవది బన్నంబు దొలగించె నెవ్వడా 
      దీనమందారుండు దిక్కు నాకు

నెవ్వని పదాబ్జమున జనియించు జలము
మజ్జనకుడైన శివుడాత్మమౌళి నిలిపె
నమ్మహా విష్ణు డా కృష్ణు డా గుణాభ్థి
దేవకీనందనుడె యెందు దిక్కు నాకు

ఇది తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యము అనే కావ్యము లోనిది.  

త్రిపురాసుర సంహార సమయములో, శివుని మేని నుండి కారిన ఘర్మజలము (చెమట నీరు) భూమి మీద పడి భైమీనదిగా ప్రవహించిందిమాహావేగంతో ప్రవహిస్తూ వస్తున్న నదిని పాండురంగ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు నిరోధిస్తాడుఅప్పుడు భైమీనది చేసిన ప్రార్థనయే యీ పద్యముఅర్థము సువిదితమేశ్రీమహావిష్ణువును సృష్టి స్థితి లయ కారకునిగ, (త్రిమూర్త్యాత్మకునిగా ) వర్ణించిన తెనాలి కవి, తక్కిన మూడు పాదములలో, విడిగా విష్ణువును స్థితి కారకునిగా చూపి, అతని శిష్ట రక్షణను గజేంద్ర మోక్షణ కథ, ధృవోపాఖ్యానము, ద్రౌపదీ మానసంరక్షణ కథలను ధ్వనింపజేసాడు.

అయితే మహాకవియైన రామకృష్ణుని గడుసుదనమంతా గీతపద్యంలో ఉంది.   భైమీనది తన జన్మకారకుడైన శివుడు, విష్ణు పాదోద్భవయైన గంగానదిని తన శిరస్సున ధరించాడని, అందువల్ల శివుని మేని నుండి  ఉద్భవించిన తనకు, కృష్ణుని(విష్ణువు) పాదముల చెంత ఇంత చోటివ్వమని ప్రార్థిస్తుందిఇంకొక విశేషం కూడా ఉంది యీ గీతపద్యములో. కృష్ణుణ్ణి గుణాబ్ధి అని సంబోధించడము. నది సముద్రాన్ని చేరడం లోకసహజమే కదా


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like